కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి సర్కార్ కమిషన్ విచారణ జరిపించిన వేళ.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను తమకు ఇవ్వాలని సీఎస్కు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. హరీష్ రావుతోపాటు కేసీఆర్ కూడా ఈ కమిషన్ రిపోర్ట్ను ఇవ్వాలని వేర్వేరుగా వినతి పత్రాలు అందించారు.