జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఎల్లుండికి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు సమర్పించగా.. ఆ కమిషన్ తమ పరిధి దాటి వ్యవహరించిందని పిటిషనర్లు ఆరోపించారు. దీనికి సంబంధించి.. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించగా.. విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.