సంగారెడ్డి జిల్లాకు చెందిన మధు కుమార్ అనే బాలుడు కరెంట్ షాక్ కారణంగా కాళ్లు, చేతులు కోల్పోయినా, పట్టుదలతో పదో తరగతిలో 86 శాతం మార్కులు సాధించాడు. నాలుకను ఆయుధంగా చేసుకుని చదివిన మధును కలెక్టర్ క్రాంతి వల్లూరు అభినందించి, ల్యాప్టాప్ బహుకరించారు. కలెక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని, ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయనని మధు తెలిపాడు. అతని ఆత్మవిశ్వాసాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. కలెక్టర్ కావడమే తన లక్ష్యం అంటున్నాడు మధు కుమార్. ఆ వివరాలు..