తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 15 సరిహద్దు చెక్పోస్టులను తొలగించింది. ఈ కీలక నిర్ణయంతో వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని.. వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయని అధికారులు తెలిపారు. గతంలో చెక్పోస్టుల వద్ద జరిగే తనిఖీలు, పన్నుల వసూళ్ల వల్ల ప్రయాణికులు, రవాణాదారులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈ సమస్యకు ముగింపు పలికి.. సరుకు రవాణా, వాణిజ్య కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి. భవిష్యత్తులో ఈ-టెక్నాలజీ, సీసీటీవీ పర్యవేక్షణ ద్వారా వాహనాల తనిఖీలను మరింత పారదర్శకంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.