అంగన్వాడీ కేంద్రంలో పిల్లల అస్వస్థతకు కారణమైన టీచర్, ఆయాలను విధుల నుంచి తొలగిస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంగన్ వాడీ కేంద్రంలో పరిశుభ్రవత పాటించకపోవడంతో చిన్నారుల ప్రాణాల మీదకు వచ్చింది. తాగే నీటిలో ఎలుక పడినా ఎవరూ గమనించకపోవడంతో పిల్లలు అవే నీళ్లను తాగారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెంది.. ఆసుపత్రికి తరలించారు. వారికి ఎలాంటి అపాయం లేదని సీడీపీఓ హేమభార్గవి పేర్కొనగా.. తాజాగా ఈ చర్యలకు కారణమైన వారిని విధుల నుంచి తొలగించారు.