ప్రభుత్వ ఖజానాపై అద్దె భారాన్ని తగ్గించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31లోగా ప్రైవేటు భవనాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కార్యాలయాలు తరలిపోవడంతో హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చిన బీఆర్కే భవన్, గగన్ విహార్ వంటి భవనాల్లోకి వీటిని మార్చనున్నారు. జనవరి 1 నుంచి ఈ ఆఫీసులు తప్పనిసరిగా సొంత భవనాల్లోనే పనిచేయాలి. ఒకవేళ గడువు దాటితే ఫిబ్రవరి 1 నుంచి అద్దె చెల్లింపులు నిలిపివేస్తామని.. దీనికి అధికారులే వ్యక్తిగత బాధ్యత వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.