కుటుంబంపై హిజ్రాల దాడి.. అవమానంతో ఆ మహిళ ఎంత పని చేసిందంటే.?

11 months ago 22
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. హిజ్రాలు దాడి చేయటంతో ఓ మహిళ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. విజయవాడలోని గిరిపురం ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనకు ప్రేమ వ్యవహారం కారణమనే వార్తలు కూడా వస్తున్నాయి. సెప్టెంబర్ 11వ తేదీ కుమారి అనే మహిళ ఇంటిపై కొంతమంది హిజ్రాలు దాడి చేశారు. కుటుంబసభ్యులకు చితకబాదారు. దీంతో మనస్తాపానికి గురైన కుమారి ఉరివేసుకుని బలవన్మరణానికి యత్నించింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూసింది.
Read Entire Article