కుప్పం ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఆ ప్రాంత అభివృద్ధికి ఆరు ఒప్పందాలు కుదిరాయి. వ్యర్థాల నిర్వహణ, మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, ఫైబర్ బోర్డ్ ఉత్పత్తి, విమానాల తయారీ యూనిట్, స్పేస్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ వంటి పలు రంగాల్లో పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రాంతంలో వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఆయా కంపెనీలు ముందుకు వచ్చి సీఎం చంద్రబాబు సమక్షంలోనే ఒప్పందాలు చేసుకున్నాయి. దీని ద్వారా ఈ ప్రాంతంలో వందల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆ వివరాలు.