కుప్పంలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తీర్చలేదంటూ ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. ఈ ఘటన చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరిగింది. దీనిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందని విమర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు ఈ ఘటనపై ఎస్పీతో మాట్లాడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.