CM Chandrababu 5 lakh to kuppam Woman: కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కుప్పం ఘటనలో బాధిత మహిళ శిరీషను చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని అప్పటికప్పడే రూ. 5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. శిరీష పిల్లల చదువు బాధ్యతలను ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటన సంచలనం రేపగా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.