Kuppam Man Tied Woman To Tree And Attacked: చిత్తూరు జిల్లాలో దారుణాలు వెలుగు చూశాయి. కుప్పంలో అప్పు కోసం ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. మరోవైపు, నరసింహాపురంలో అంగన్వాడీ కేంద్రంలో బాలుడిని కొట్టడంతో కలకలం రేగింది. పౌష్టికాహారం సరిగా పెట్టలేదని చెప్పినందుకు టీచర్లు బాలుడిని కొట్టారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.