ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. కుప్పంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అంతకుముందు బస్సులో ప్రయాణించిన చంద్రబాబు.. మహిళలతో ముచ్చటించారు. వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీలో మహిళల కోసం ఉచిత బస్సు పథకం - స్త్రీ శక్తి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు పథకంపై మహిళల అభిప్రాయాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.