Kuppam Haryana Gang vs Police: చిత్తూరు జిల్లా కుప్పంలో హర్యానాకు చెందిన దొంగల ముఠా హల్ చల్ చేసింది. సరిహద్దు దాటుతుండగా పోలీసులు అడ్డుకోబోగా వారిపైకి కారుతో దూసుకెళ్లారు. పోలీసులు కాల్పులు జరిపినా దొంగలు కారు వదిలి పారిపోయారు. డీఎస్పీ ఆధ్వర్యంలో కృష్ణగిరి-పలమనేరు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. పరమసముద్రం చెరువు దగ్గర కారును వదిలి పరారైన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.