Telangana Kula Ganana Re Survey: తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి కులగణన సర్వే నిర్వహిస్తోంది. అయితే.. ఈసారి ప్రజలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. గతంలో నిర్వహించిన సర్వే సమయంలో.. ప్రజలకు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. ఈసారి మూడు పద్దతుల్లో సర్వే నిర్వహిస్తోంది. ఒకటి టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే.. ఇంటికే వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్తారు. మరోకటి.. ఆన్లైన్లోనే సర్వేలో పాల్గొనటం.. దగ్గర్లోని ఎంపీడీవో, వార్డు ఆఫీసులకు వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశాలు కల్పించింది.