తెలంగాణ ప్రభుత్వానికి అందిన కులగణన నివేదికపై పలు రాజకీయ పార్టీలు , బీసీ సంఘాల నేతలు, బీసీ మేధావుల ఫోరం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా బీసీల జనాభాను తక్కువగా చూపిస్తున్నారన్నారు. గతంలో 52 శాతం ఉన్న జనాభా.. 46 శాతానికి ఎలా పడిపోయిందని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో 10 శాతం ఉన్న ఓసీలు 15 శాతానికి ఎలా పెరిగారని నిలదీస్తున్నారు. తప్పుల తడకగా ఉన్న కులగణన సర్వేను రివ్యూ చేయాలని కోరారు.