హైదరాబాద్లో పెను సంచలనం సృష్టించిన రూ.కోటి దారి దోపిడీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఈ ఘటనలో బాధితుడిగా పేర్కొన్న వ్యక్తే.. నేరానికి కీలక సూత్రధారి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. హవాలా సొమ్ముపై కన్నేసిన ఆ వ్యక్తి.. తన ఫ్రెండ్స్తో కలిసి ఆ డబ్బును కొట్టేయాలని పక్కా ప్లాన్ వేశాడు. కానీ పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనలో రూ.77 లక్షలను పోలీసులు రికవరీ చేశారు.