కూటమి ప్రభుత్వంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

5 months ago 23
తిరుపతిలోని మారుతినగర్ క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన, 2011 నుండి పార్టీ సాగించిన 15 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిందని, తన 48 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంతటి దారుణమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని విమర్శించారు. అభివృద్ధి అంతా అమరావతికే పరిమితం చేస్తూ రాయలసీమను, పోలవరాన్ని విస్మరించారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని మండిపడుతూ, భగవంతుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
Read Entire Article