సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, మంత్రి నిమ్మల రామానాయుడు మధ్యన జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుమార్తె వివాహానికి బాలయ్యను ఆహ్వానించేందుకు నిమ్మల రామానాయుడు.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ వద్ద బాలకృష్ణను కలిశారు. ఈ సమయంలో అక్కడ బోయపాటి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంభాషణ జరగ్గా.. మంత్రి నిమ్మల రామానాయుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.