తెలుగు రాష్ట్రాల్లో మరో పరువు హత్య చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని కసాపురంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కూతురు ప్రేమ వివాహం చేసుకుంటానన్నదనే కోపంతో ఓ తండ్రి ఆమెను హత్య చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టాడు. అనంతరం గుంతకల్లు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.