AP Will Benefit In Jal Jeevan Mission Extension Decision: కేంద్ర కేబినెట్ జల్జీవన్ మిషన్ పథకం అమలు కాలపరిమితిని పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఏపీలో కూడా ప్రజలకు లబ్ధి చేకూరనుంది. 24 లక్షల ఇళ్లకు ప్రయోజనం కలగనుంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల్ని కలిసి జలజీవన్ మిషన్ పథకం పరిమితిని పెంచాలని కోరిన సంగతి తెలిసిందే.