తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్, రఘునందన్ రావు వంటి పలువురు నేతల వాంగ్మూలాలు ఇప్పటికే రికార్డ్ చేసిన సిట్ అధికారులు.. తాజాగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు నోటీసులు జారీ చేశారు. లేక్వ్యూ గెస్ట్ హౌస్లో ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది.