Kavuri Sambasiva Rao Death: సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఇకలేరు. కొంతకాలంగా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. కావూరి మరణంపై రాజకీయ నేతలు సంతాపాన్ని తెలిపారు. ఆయన ఐదుసార్లు ఎంపీగా విజయం సాధించారు. మన్మోహన్ కేబినెట్లో కేంద్రమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కావూరి.. బీజేపీలో చేరారు. ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్గా లేరు.