ఆంధ్రప్రదేశ్లోని పలు రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. అమృత్భారత్ స్టేషన్ పథకం కింద ఏపీలోని 73 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. అందులో వైఎస్ఆర్, అన్నమయ్య, కర్నూలు జిల్లాల్లోని పలు రైల్వేస్టేషన్లకు స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో ఆయా రైల్వేస్టేషన్లలో కేంద్రం కేటాయించే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రైలు ప్రయాణికులకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటుగా రైల్వేస్టేషన్ ఆకర్షణీయంగా ఉండేలా అభివృద్ధి చేస్తారు.