మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును చట్ట వ్యతిరేకమని అభివర్ణించారు. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్కు ఢిల్లీలో అభ్యంతరాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఈ ప్రాజెక్టు ఉల్లంఘిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ఆందోళనలు పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా రావాలని కోరారు. ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ అనుసంధానంపై చర్చకు సిద్ధమన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి పాటిల్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, మూసీ పునరుజ్జీవానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.