AP High Court Order Ka Paul To Pay Rs 5 Lakhs: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి కేసులో సీబీఐ విచారణ కోరుతూ వేసిన పిల్పై రూ.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. డబ్బులు కడితేనే పిల్ను పరిశీలిస్తామని తేల్చి చెప్పింది. సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలని కోరగా, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడవద్దని కోర్టు హెచ్చరించింది. ఈ కేసు సమ్మర్ సెలవుల తర్వాత విచారణకు రానుంది.