ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా తన కుమారుడిని చూడాలనే కోరికను వ్యక్తం చేశారు. ఎలాన్ మస్క్తో కలిసి పనిచేసే అవకాశం ఉందని తెలిపారు. యెమెన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియను రక్షించాలని కోరుతూ, ఆమెకు క్షమాభిక్ష పెట్టాలని యెమెన్ ప్రధానికి లేఖ రాశానని పాల్ పేర్కొన్నారు. మహిళలకు ఏ దేశంలోనూ రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివరాలు..