Yanam Pulasa Fish Huge Rate: గోదావరి జిల్లాల్లో పులస చేపల సీజన్ ఊపందుకుంది. యానాంలో మంగళవారం నిర్వహించిన వేలంలో 1.515 కిలోల పులస చేప రూ.29 వేలకు అమ్ముడుపోయింది. మరోవైపు, 20.300 కేజీల బరువున్న పండుగప్ప చేప రూ.16 వేలకు అమ్ముడైంది. ఈ చేపల్లో ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. వరద తగ్గాక మరికొన్ని పులస చేపలు మరింతగా దొరికే అవకాశం ఉందని మత్స్యకారులు చెబుతున్నారు.