బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో అరుదైన గౌరవం దక్కింది. కేటీఆర్కు అమెరికా నుంచి ఆహ్వానం అందింది. యూఎస్లోని ఇల్లినాయ్లోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో ఏప్రిల్ 19వ తేదీన నిర్వహించనున్న కెల్లాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ -2025లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈ మేరకు కేఐబీసీ వైస్ ప్రెసిడెంట్ చెనాక్షా గోరంట్ల లేఖ పంపించారు. మంత్రిగా పదేళ్ల పాటు కేటీఆర్ అందించిన సేవలను గోరంట్ల ప్రశంసించారు.