తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్కు, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ రెండవసారి నోటీసులు పంపింది. జూన్ 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. గతంలో కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అరవింద కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను విడివిడిగా ప్రశ్నించారు. మూడు నెలల పాటు విచారణలో పురోగతి లేకపోవడంతో మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పటి మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ కీలక బాధ్యతలు నిర్వహించిన నేపథ్యంలో.. ఆర్థిక అవకతవకల ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉత్కంఠను రేపింది.