తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కేటీఆర్, లోకేష్ భేటీపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అర్థరాత్రి భేటీపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టీడీపీ మద్దతు కోరారని ఆరోపించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఎవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్రంతో చర్చలు తప్పవని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరుగుతోంది. విలన్లు క్లైమాక్స్లోనే అరెస్ట్ అవుతారు. కేటీఆర్ డ్రగ్స్ కేసులోనూ విచారణ జరుగుతోంది. బీసీ రిజర్వేషన్లపై మా వ్యూహం మాకుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.