కేదార్నాథ్ వెళ్లే యాత్రికులకు శుభవార్త. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి కేదార్నాథ్ చేరుకున్న వారి కోసం మన సిద్దిపేటకు చెందిన వారు ఉచితంగా మూడు పూటలా భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. నిత్యం టీ, టిఫిన్ల దగ్గరి నుంచి మొదలుపెడితే మధ్యాహ్నం లంచ్.. సాయంత్రం స్నాక్స్.. రాత్రి భోజనం వరకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా యాత్రికులకు అందిస్తున్నారు. గత 5 ఏళ్లుగా సిద్దిపేటకు చెందిన సేవా సమితి.. కేదార్నాథ్కు వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తూ వారి ఆకలిని తీర్చుతోంది.