తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీల అమలుపై కేరళ మీడియా సాక్షిగా క్షేత్రస్థాయిలో చర్చకు సిద్ధమన్నారు. అమలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ప్రకటించారు. అలాగే.. హుజూరాబాద్లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలకు, వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందని, ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇల్లందకుంట రామాలయ రథోత్సవంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.