హైడ్రాపై మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చుతున్నారని మండిపడింది. తార్నాక ఎర్రకుంట ఆక్రమణకు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. హైడ్రా, జీహెచ్ఎంసీలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆక్రమణకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదని పిటిషనర్ చేసిన వాదనలపై స్పందించిన హైకోర్టు.. ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను వాయిదా వేసింది.