గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో నాగరాజును ప్రశ్నించేందుకు కస్టడీకి ఇవ్వాలన్న సిట్ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు.. 8 రోజుల పాటు అనుమతించింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సాయికృష్ణను కస్టోడియల్ డెత్గా గుర్తించినట్టు సిట్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం గమనార్హం. మృతదేహాన్ని మాయం చేసినట్లు అందులో పేర్కొన్నారు. మే 5 నుంచి జూన్ 10 మధ్య కృష్ణలంక స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.