మే డే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్కు కడుపు నిండా విషం తప్ప ఇంకో ఆలోచన లేదు’ అంటూ.. ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల గురించి ప్రస్తావించారు. కార్మికుల సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గిగ్ కార్మికుల కోసం కొత్త చట్టం తెస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కార్మికులు , ప్రజల సహకారం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.