తెలంగాణలో సంచలనం స్పష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ కేసులో హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను విచారించిన సిట్ అధికారులు తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను విచారించేందుకు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం సిట్ అధికారులు నోటీసు ఇవ్వగా.. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఉండటంతో వాయిదా వేయాలని కేసీఆర్ వేడుకోవడంతో దానిని వాయిదా వేశారు. ఈసారి ఎలాంటి మినహాయింపులు ఉండవని.. కచ్చితంగా ఫిబ్రవరి 1వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.