నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కల్వకుంట్ల కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, కేసీఆర్ కుటుంబ సభ్యుల భద్రతకు ముప్పు ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు ఆయన కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని ఉందని ఆరోపించారు.