శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (ఫిబ్రవరి 17న) రోజు మీడియాతో చిట్ చాట్ చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణలోని 4 కోట్ల మందికి హీరో అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓట్లేయలేదు.. ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే.. కులగణన, ఉపఎన్నికలు, ఉచిత పథకాలపై కూడా గుత్తా స్పందించారు.