తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరిగాయి. పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బీసీ రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గంగుల వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. బీసీల్లో అనుమానాలు కలిగేలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని ఆయన కోరారు. కేసీఆర్ కుటుంబం ఎవరినీ కలవని కుటుంబమని విమర్శించారు.