తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. ఈరోజు (మార్చి 15న) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను చేసిన స్ట్రెచర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి ఖండించారు. కేసీఆర్ చెడును తాను ఎందుకు కోరుకుంటానని.. ఆయన వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలను కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.