బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుమారు పదేళ్లపాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఈ సమయంలో ప్రగతి భవన్ నుంచే ఆయన వ్యవహారాలను చక్కబెట్టారు. దీంతో సీఎం అధికారిక నివాసానికి నిత్యం పెద్ద సంఖ్యలో నాయకులు వచ్చేవారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సైతం తరచుగా ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసేవారు. 2023లో ఆయన ప్రగతి భవన్కు వెళ్లిన ఆయన.. బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొనడానికి రావాలని సీఎంను ఆహ్వానించారు. అప్పటి ఫొటో ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.