కాంగ్రెస్లో కొండా సురేఖ వ్యవహారం ఉత్కంఠ రేపుతున్న సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కొండా మురళి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఈ అంశంపై తాను మాట్లాడబోనని తెలిపారు.