కొందరు ఎగతాళి చేసినా ఒక్క సంక్షేమ పథకం.. అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైంది: సీఎం రేవంత్

11 months ago 13
తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించటం అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పథకం మహిళలకు ఆర్థికంగా తోడుగా నిలవడమే కాకుండా, ఆర్టీసీకి పునర్వైభవం తెచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. ఉచిత ప్రయాణం తర్వాత బస్సుల్లో మహిళల ఆక్యుపెన్సీ 35 శాతం నుంచి 60 శాతానికి పెరిగిందని అన్నారు. ప్రజాపాలన ప్రారంభమయ్యే నాటికి మూతపడే పరిస్థితిలో ఉన్న ఆర్టీసీకి.. 200 కోట్ల జీరో టికెట్లతో ప్రాణం పోసిన ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులకు సీఎం అభినందనలు తెలిపారు.
Read Entire Article