తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ను ఏఐ ఆధారిత గిబ్లీ ఫోటో చిక్కుల్లో పడేసింది. కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించి తప్పుడు ప్రచారం చేశారంటూ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆమె రీట్వీట్ చేసిన గిబ్లీ చిత్రం నకిలీదని గుర్తించి నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.