కొంపల్లిలో కిరాణా జనరల్ షాపు నడుపుతున్న సాయిబాబా అనే వ్యక్తికి ఊహించని కష్టం ఎదురైంది. బుధవారం రాత్రి ఇద్దరు దుండగులు గన్తో బెదిరించి రూ.5 లక్షలు, సెల్ ఫోన్ దోచుకెళ్లారు. గతంలోనూ ఇదే షాపులో రూ.10 లక్షల విలువైన సరుకు చోరీకి గురైందని బాధితుడు తెలిపాడు. వరుస దొంగతనాలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.