కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్ చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి ఉపఎన్నికకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఉపఎన్నికలో తాము ప్రచారం కూడా చేయమని.. 50 వేల కంటే ఒక్క ఓటు తక్కువొచ్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. మళ్లీ జనాల్లో కూడా తెరగనంటూ సంచలన సవాల్ చేశారు.