ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్ క్యాంపస్లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ISH)ను సందర్శించారు. తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అడ్మిషన్ కోసమే ఆయన స్కూలుకు వెళ్లినట్లు తెలిసింది. ఇటీవల సింగపూర్లో చదువుతుండగా జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడగా.. ఇక నుంచి అతడిని హైదరాబాద్లోనే చదివించాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.