ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలు ప్రజలకు అర్థమవ్వాలనే ఉద్దేశంతో తెలుగులోనూ జీవోలు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉత్తర్వులు కేవలం ఇంగ్లీషులో మాత్రమే జారీ చేసేవారు. అయితే ప్రజలకు మరింత సులభంగా అర్థమవ్వాలనే ఉద్దేశంతో తెలుగులోనూ జీవోలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నుంచి అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లగా.. ఏపీ హోం శాఖ నుంచి తెలుగులో తొలి జీవో విడుదలైంది.