Vodarevu Chilakaluripet National Highway 167 A: రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా బాపట్ల-పల్నాడు మధ్య నిర్మిస్తున్న 167ఏ హైవే పనులు 95% పూర్తయ్యాయి. అయితే, ప్రారంభానికి ముందే రోడ్డు పగుళ్లు, తుఫాన్ వల్ల కోతకు గురవడం వంటి లోపాలు బయటపడ్డాయి. పర్చూరు వద్ద వాగుపై వంతెనకు మట్టి కట్ట కొట్టుకుపోవడం, డివైడర్లో రాళ్లు ఉండటం వంటి సమస్యలున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో రహదారి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.