కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. ఏప్రిల్ 25న ప్రారంభించనున్నట్లు తెలిపిన కవిత

4 weeks ago 4
తన కొత్త పార్టీపై కల్వకుంట్ల కవిత తాజాగా ప్రకటన చేశారు. పార్టీ ఏర్పాటుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. వచ్చే నెల 25వ తేదీన తన కొత్త పార్టీ ప్రారంభోత్సవం ఉంటుందని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం రోజున తెలంగాణ జాగృతి కార్యకర్తలు, తెలంగాణ సమాజం భారీ ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ప్రజలకు అండగా నిలవలేదని.. కొత్త రాజకీయ పార్టీ అవసరం వచ్చిందని.. అందుకే తాను పార్టీ పెడుతున్నట్లు తెలిపారు.
Read Entire Article